నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:45

అంబేద్కర్‌ బీఎడ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ దరఖాస్తు గడువు మే 22

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓ యూ)లో బీఎడ్‌, బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువు వచ్చేనెల 22 వరకు ఉన్నది.

ఈ మేరకు అంబేద్కర్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎవిఎన్‌ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు విశ్వవిద్యాలయ పోర్టల్‌ www. braouonline.in ద్వారా దరఖాస్తు చేసు కోవాలని సూచించారు.

ఎంట్రెన్స్‌ ఫీజు రూ.వెయ్యి, ఎస్సీ,ఎస్టీ, వికలాంగులకు రూ.750 చెల్లించాలని కోరారు. జూన్‌ ఆరో తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు బీఎడ్‌ ప్రవేశ పరీక్ష,

మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బీఎడ్‌ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) పరీక్షను నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్షకు రెండు రోజుల ముందు హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:40

ఏప్రిల్‌ 25 నుంచి వేసవి సెలవులు..

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివే 1 నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు గురువారంతో ముగిశాయి. ఏప్రిల్‌ 12 నుంచి 20 వరకు ఎస్‌ఏ-2 పరీక్షలు నిర్వహించారు.

పరీక్షలు ఇక ముగియడంతో ఏప్రిల్‌ 25 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఏప్రిల్‌ 21 నుంచి 24 వరకు జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు.

ఆ తర్వాత విద్యార్థులకు మార్కులు చెప్పి సెలవులు ప్రకటిస్తారు. జూన్‌ 12న 2023-24 నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం శుక్రవారం నుంచి వేసవి సెలవులను ముందస్తుగా ప్రకటించేశాయి.

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:38

గురుకులాల్లో మహిళా గురువులు 80%

టీజీటీ, పీజీటీల్లో అత్యధికం మహిళలకే కేటాయింపు

జేఎల్‌, డీఎల్‌లో మెజారిటీ ఉద్యోగాలు మహిళలకే..

బాలికల గురుకులాలు ఎక్కువ ఉండటమే కారణం

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా టీచింగ్‌ పోస్టుల్లో దాదాపు 80 శాతం మహిళలకే ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో తొలిదఫా 9,231 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌ ) నోటిఫికేషన్‌ జారీచేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఇటీవలే జూనియర్‌, డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జేఎల్‌ 2,008, డీఎల్‌ 868 పోస్టులకుగాను దాదాపు 80 శాతం అంటే 2,301పోస్టులు మహిళలకే సొంతమయ్యాయి. ఈ నెల 24న పీజీటీ, టీజీటీ నోటిషికేషన్‌ విడుదల కానున్నది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పీజీటీ 1,276, టీజీటీ 4,020 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో కూడా మహిళలకే ఎక్కువభాగం దక్కనున్నాయని అధికారులు తెలిపారు.

సర్వీస్‌ నిబంధనలతో మహిళలకు లబ్ధి

గురుకుల విద్యాలయాలకు సంబంధించిన పోస్టుల్లో అత్యధికం మహిళలకు దక్కడానికి సర్వీస్‌ నిబంధనలే కారణమని అధికారులు తెలిపారు. బాలికల గురుకులాల్లోని పోస్టులు 100 శాతం మహిళలకే కేటాయించాలని సర్వీస్‌ రూల్స్‌ చెప్తున్నాయి. ఇక బాలుర గురుకులాల్లో సాధారణంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారు. వెరసి మహిళలకు అత్యధికంగా అవకాశాలు దక్కుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 1,001 గురుకులాలను ఏర్పాటు చేసింది. అందులో 2016లో తొలుత ఐదో తరగతి నుంచి ప్రారంభించి క్రమంగా వాటిని ఇంటర్‌వరకు అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తున్నది. మహిళల కోసం డిగ్రీ గురుకుల కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నది. మొత్తం గురుకులాల్లో బాలికలకు ప్రత్యేకంగా 5-10 తరగతి వరకు 551, ఇంటర్‌ వరకు 453 గురుకులాలున్నాయి. అవి కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ బాలికల కోసం మొత్తం 54 గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం నెలకొల్పింది. మొత్తం 1,001 గురుకులాల్లో సగానికిపైగా బాలికలకు సంబంధించినవే కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఆయా గురుకులాల్లో పోస్టులన్నీ మహిళలకు దక్కుతున్నాయి.

20వేలు దాటిన ఓటీఆర్‌

గురుకుల డిగ్రీ లెక్చరర్‌, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు సంబంధించి ఇప్పటిరకు దాదాపుగా 20 వేల మందికిపైగా అభ్యర్థులు వన్‌ టైం రిజిస్ట్రేషన్‌ (ఓటీఆర్‌) చేసుకొన్నారని ట్రిబ్‌ అధికారులు వెల్లడించారు. డీఎల్‌, జేఎల్‌ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొంటుండటంతోపాటు పేమెంట్లు కూడా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ పోస్టులకు దాదాపు 3 లక్షల మందికిపైగా పోటీ పడే అవకాశమున్నదని అంచనా వేస్తున్నారు. జేఎల్‌, డీఎల్‌ పోస్టులకు మే17 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.

అదనంగా లైబ్రేరియన్‌, పీడీ పోస్టులు

టీచింగ్‌ పోస్టులకు తోడు ఈసారి లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు అందుబాటులోకి రావడం విశేషం. స్కూల్‌ లెవల్‌ నుంచి మొదలు డిగ్రీ గురుకుల కాలేజీ వరకు ఆయా క్యాటగిరీల్లో పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇది బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తిచేసిన అభ్యర్థులకు వరంగా మారింది. గురుకుల పాఠశాలల్లో 434, జూనియర్‌ కాలేజీల్లో 50, డిగ్రీ కాలేజీల్లో 36 లైబ్రేరియన్‌ పోస్టులు కలిపి 520 ఉద్యోగాలు భర్తీచేయనున్నారు. గురుకుల పాఠశాలల్లో 275, జూనియర్‌ కాలేజీల్లో 34, డిగ్రీ గురుకులాల్లో 39 మొత్తంగా 348 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు భారీగా వచ్చాయి. పీడీ, లైబ్రేరియన్‌ పోస్టులు మొత్తం 686 ఉన్నాయి.

నిజంనిప్పులాంటిది

Apr 21 2023, 09:33

వాట్సప్ లో యానిమేటెడ్ ఎమోజీలు

•త్వరలోనే అందుబాటులోకి..

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సప్' త్వరలోనే కొత్త ఫీచర్ను ప్రవే శపెట్టనుంది. టెలిగ్రామ్ యాప్ తరహాలో తమ వినియోగదారుల కోసం సొంతంగా యానిమే టెడ్ ఎమెజీలను అందుబాటులోకి తీసుకురా నుంది.

లొట్టీ లైబ్రరీ సాయంతో వాటిని రూపొం దిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఆండ్రా యిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్లు అందిస్తున్న ఎమోజీలనే వాట్సప్ యాప్లో వినియోగదారులు ఉపయోగిస్తున్న సంగతి గమనార్హం.

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 20:31

SpaceX: స్టార్‌షిప్‌ ప్రయోగం విఫలం.. గాల్లోనే పేలిపోయిన అతిపెద్ద రాకెట్‌..!

వాషింగ్టన్‌: ఎలాన్‌మస్క్‌ నేతృత్వంలోని స్పేస్‌ఎక్స్‌ చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌ 'స్టార్‌షిప్‌ (Starship)' ప్రయోగం విఫలమైంది..

అమెరికా (America) దక్షిణ టెక్సాస్‌లోని బోకా చీకా తీరం నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన ఈ భారీ రాకెట్‌.. కొద్దిసేపటికే పేలిపోయింది.

ఈ వ్యోమనౌక రెండు సెక్షన్లు (బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌).. నిర్ణీత సమయం (3 నిమిషాలు)లోగా విడిపోవాలి.

కానీ, విఫలం కావడంతో పేలిపోయినట్లు 'స్పేస్‌ఎక్స్‌' సంస్థ పేర్కొంది. ఈ ప్రయోగ ఫలితాలను తమ శాస్త్రవేత్తలు సమీక్షిస్తారని వెల్లడించింది..

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 13:43

Nara Lokesh: బెంజ్‌ మంత్రి కారుచౌకగా భూములు కొట్టేశారు: డాక్యుమెంట్లు బయటపెట్టిన లోకేశ్‌

ఆలూరు: మంత్రి గుమ్మనూరు జయరామ్‌ 180 ఎకరాల ఇట్టినా కంపెనీ భూములను కాజేశారంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పలు ఆధారాలను విడుదల చేశారు..

దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన బయటపెట్టారు. కమర్షియల్‌ ల్యాండ్‌గా ఉన్న భూమిని వ్యవసాయ భూములుగా చూపిన మంత్రి.. తన కుటుంబం పేర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని ఆరోపించారు..

రూ.45 కోట్ల విలువైన భూమిని రూ.2కోట్ల ప్రభుత్వ విలువ చూపించి కారుచౌకగా కొట్టేసిన ఘనుడు బెంజ్‌ మంత్రి అంటూ లోకేశ్‌ దుయ్యబట్టారు.

వ్యవసాయంలో లాభం వచ్చిందన్న మంత్రి.. ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం ఎందుకు తీసుకున్నారని ఆయన నిలదీశారు. రైతులు ముందుకొస్తే ఇట్టినా భూములను రాసిస్తానన్న మంత్రి.. రిజిస్ట్రేషన్‌ తేదీ ప్రకటించాలని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. ఆ భూములను తామే కొని రైతులకు పంచుతామని చెప్పారు..

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 13:42

Viveka Murder Case: రెండో రోజు మొదలైన సీబీఐ విచారణ.. ఆ ముగ్గుర్నీ వేర్వేరుగా..

హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని సీబీఐ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు..

చంచల్‌గూడ జైలు నుంచి వారిద్దరినీ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సీబీఐ కోర్టు ఇది వరకే ఆదేశించింది. వారిద్దరినీ వేర్వేరుగా విచారిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఇదే కేసులో ఎంపీ అవినాష్‌ రెడ్డి రెండో రోజు విచారణకు హాజరయ్యారు. ఎంపీ నుంచి ఏయే విషయాలు రాబట్టాలన్న దానిపై సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని రూపొందించుకున్నారు.

బుధవారం కొన్ని ప్రశ్నలు అడగ్గా.. ఇవాళ వాటికి కొనసాగింపుగా ఇవాళ మరిన్ని ప్రశ్నలు సంధించే అవకాశముంది..

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 13:41

Rahul Gandhi: రాహుల్‌ గాంధీకి చుక్కెదురు.. తీర్పు నిలుపుదల పిటిషన్‌ తిరస్కరణ

సూరత్‌: పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపేయాలంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) వేసిన స్టే పిటిషన్‌ను గుజరాత్‌లోని సూరత్‌ సెషన్స్‌ కోర్టు గురువారం తిరస్కరించింది..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు.. రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.

ట్రయల్‌ కోర్టు ఈ కేసుపై పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని, ఇది రెండేళ్లు జైలుశిక్ష విధించాల్సినంత కేసు కాదంటూ సెషన్స్‌ కోర్టును రాహుల్‌ ఆశ్రయించారు.

శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్ఠకు పూడ్చలేని నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్‌ పిటిషన్‌పై గత గురువారం వాదనలు విన్న న్యాయమూర్తి ఆర్‌పీ మొగేరా తీర్పును నేడు వెలువరించారు..

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:39

TS EAMCET: తెలంగాణ ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ రద్దు

ఈసారి నుంచి శాశ్వతంగా తొలగింపు

ఎంసెట్‌ మార్కులతోనే ర్యాంకు

జీఓ జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌లో ఈసారి నుంచి ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేస్తూ విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక నుంచి ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌లోని భాషేతర సబ్జెక్టులకు ...అంటే 600 మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయించేవారు. ఇక నుంచి ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండానే ఎంసెట్‌లో స్కోర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

జేఈఈ మెయిన్‌, నీట్‌లలోనూ ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఎత్తివేశారు. ఎంసెట్‌కు పలు బోర్డుల నుంచి విద్యార్థులు హాజరవుతారు. ఆయా బోర్డులు సకాలంలో ఫలితాలను విడుదల చేయకపోవడం, ఎంసెట్‌ అధికారులకు అందజేయకపోవడం వల్ల ఎంసెట్‌ ఫలితాలకు ఆటంకం ఏర్పడుతోంది.

ఇలాంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రతిపాదన మేరకు ఇంటర్‌ వెయిటేజీని రద్దు చేసింది. కరోనా కారణంగా 2020, 2021, 2022లలో కూడా ఇంటర్‌ వెయిటేజీని తొలగించారు. ఈసారి దానిని శాశ్వతంగా రద్దు చేస్తూ... గతంలోని జీఓను సవరిస్తూ తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీఓ 18ను జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

Apr 20 2023, 07:37

దళారుల చేతిలో ధరలు

- మొక్క జొన్న ధరలు పతనం

మార్కెట్‌లో రూ. 2200 నుంచి రూ.1800లకు తగ్గుదల

- వ్యాపారులు సిండికేట్‌గా మారిన వైనం

- కానరాని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు

పంట ఏదైనా రైతుల చెంతకు రాగానే ధరలు పతనం కావడం పరిపాటిగా మారింది. మొన్నటి వరకు పత్తి, మిర్చిలో సిండికేట్‌గా మారిన వ్యాపారులు.. ఇప్పుడు మొక్కల కొనుగోలులో రైతులను నిండా ముంచుతున్నారు. వారం రోజుల కిందట మొక్కజొన్న క్వింటాకు రూ.2200 ధర ఉండగా ఇప్పుడు రూ.1800లకు చేరింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు పెరగకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

మొక్కజొన్న కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం వల్ల మార్కెట్‌లో వ్యాపారులదే ఇష్టారాజ్యం అయింది. ధరలు పెరగకుండా వ్యాపారస్తులు సిండికేట్‌గా మారి కొనుగోళ్లను నిలిపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదనే ప్రచారం చేస్తున్నారు. దాంతో చేసేది లేక రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. గతేడాది మొక్కజొన్న క్వింటాకు రూ. 2500కు కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ మధ్ధతు ధర క్వింటాకు రూ.1960 ఖరారు చేసింది.

అయితే ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దాంతో రూ.1800కే వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయకపోవడంతో మధ్య దళారుల చేతిలో రైతులు నష్ట్టపోతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2.50 లక్షల ఎకరాలకు పైగానే మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి యాసంగిలో ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారించారు. తాడూరు మండల పరిధిలోనే సుమారు 18,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. తెల్కపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో 150 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఖరీఫ్‌లో పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో ఈసారి పంటను అధికంగా సాగు చేశారు.

కౌలు రైతుల పరిస్థితి దయనీయం

మొక్క జొన్న సాగులో కౌలు రైతులే కీలకంగా ఉన్నారు. ఒక్కో ఎకరాకు రూ.పది వేలు చెల్లించి లీజుకు తీసుకున్నారు. ఎకరా పెట్టుబడి రూ.25 వేలకు దాటింది. లీజుతో కలుపుకొని మొత్తం రూ. 35వేలు అయ్యింది. 25 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు మొక్కజొన్న దిగుబడి 25 శాతం తగ్గడంతో కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. కాగా, పంట పూర్తిగా చేతికి వచ్చి కల్లాల్లో ఉన్నా నేటికీకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

పెట్టుబడి అయినా..రావడం లేదు

నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాను. కౌలుతో కలుపుకొని సుమారు రూ.1.60లక్షలు పెట్టుబడి అయింది. గతేడాది రూ.2500 అమ్మగా, ఈసారి రూ.1800కు పడిపోయింది. పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి లేదు.

- బాలస్వామి, తాళ్లపల్లి, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌

కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

పత్తి వేసి ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులు రబీలో మొక్కజొన్న సాగు చేశారు. ఈసారి ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా ఉంది. గతేడాది రూ. 2500లు ఉన్నది. ఈసారి 1800లకు పడిపోయింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి.

- శ్రీనివాసులు, రైతు సంఘం